పశ్చాత్తాపం
ప్రతి మనిషి జీవితంలో, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తారు. వాటిని గుర్తించిన తర్వాత, వారి మనసులో పశ్చాత్తాపం కలుగుతుంది.
కథ విశ్లేషణ:
బ్రిటిష్ పాలన సమయంలో, రాఘవులు అనే యువకుడు బ్రిటిష్ ప్రభుత్వం నడుపుతున్న విద్యుత్ శాఖలో లైన్మాన్గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అది విలాసవంతమైనది కాకపోయినా, స్థిరమైన ఉద్యోగం.
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాఘవులను అతని మామగారు చంద్రయ్య తో కలిసి ఉంటాడు, చంద్రయ్య రాఘవులు ని తన సొంత కుమారుడిలా పెంచాడు.
ఒక రోజు రాఘవులు పనికి వెళ్తున్న సమయంలో, కొండయ్య అనే వ్యక్తి ఆడవారితో అసభ్యగంగా ప్రవర్తించడంతో రాఘవులు కొండయ్య ని కొడతాడు. ఆ సంఘటనతో కొండయ్య రాఘవులు పైన పగ పెంచుకుంటాడు .
చంద్రయ్య కి ఒక్కగానొక్క కూతురు తన పేరు లక్ష్మి. లక్ష్మి కి ఆమె బావ ఐన రాఘవులు అంటే ఇష్టం , ప్రేమ.. ఈ విషయం తెలిసి చంద్రయ్య, లక్ష్మి కి రాఘవులు కి వివాహం చేస్తాడు. చంద్రయ్య కి కొడుకులు లేకపోవడం తో తనకు ఉన్న ఇల్లు , పోలం రాఘవులు కి ఇస్తాడు. ఇలా ఆ చిన్న కుటుంభం ఎటువంటి బాధలు కష్టాలు లేక సంతోషంగ జీవిస్తుంటారు.
కొద్ది రోజుల తర్వాత, లక్ష్మి గర్భవతిగా ఉండటం కుటుంబంలో మరింత ఆనందాన్ని తీసుకొచ్చింది. రాఘవులు మరియు చంద్రయ్య ఆమెకు శ్రేయోభిలాషలతో సీమంతం చేశారు.
ఒక రోజు, యదావిధిగా రాఘవులు తన పనికి వెళ్తాడు , చంద్రయ్య కూడా పక్క ఊర్లో పని ఉంది అని చెప్పి బయటకి వెళ్తాడు.
రాఘవులు పై కోపం పెంచుకున్న కొండయ్య ఇదే మంచి సమయం అని రాఘవులుని జీవితం లో కోలుకొని దెబ్బ కొట్టాలి అని పథకం వేస్తాడు ,తను అనుకున్న పని మొదలు పెడతాడు కొండయ్య తన అనుచరులలో ఒకరిని రాఘవులు ఇంటికి పంపించి రాఘవులు కి ప్రమాదం జరిగింది అని తనతో వెంటరమ్మని ఆ అనుచరుడు లక్ష్మి ని తీసుకెళ్తాడు.
కొండయ్య మనీషి లక్ష్మిని తన వద్దకు తీసుకొచ్చాడు. అతని మనసు ద్వేషంతో నిండి ఉంది. రాఘవులుపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమెను చంపాలని సంకల్పించాడు.
లక్ష్మి గర్భవతిగా ఉన్నా ధైర్యంగా పోరాడింది. ఆమెను అడ్డుకున్న వారిని తోసేసి ఎలాగోలా అక్కడి నుండి పారిపోయింది.
ఆ సమయంలో, సమీప గ్రామం నుండి తిరిగివస్తున్న చంద్రయ్య ఆమెను పరుగెత్తుతూ, వెనకాల కొందరు వ్యక్తులు వెంబడిస్తున్నదాన్ని చూసాడు. వెంటనే ధైర్యంగా పోరాడి తన కుమార్తెను రక్షించాడు.
అనంతరం ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. అది చుసిన కొండయ్య వెనకనుండి ఒచ్చి చంద్రయ్య ని కర్ర తో కొడతాడు. చంద్రయ్య స్పృహతప్పి పడిపోతాడు. కొండయ్య తన దగ్గర ఉన్న కత్తి తో గర్భం తో లక్ష్మి కడుపులో పొడుస్తాడు, పొడిచి అక్కడి నుండి పారిపోతాడు
లక్ష్మి ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంటుంది ఆ అరుపులు విని అక్కడే ఉన్న గిరిజనావాసులు చంద్రయ్య ని లక్ష్మి ని వాళ్ళు ఉండే స్థావరానికి తీసుకువెళతారు..లక్ష్మి ఒక అడా బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూస్తుంది .
చంద్రయ్య స్పృహలోకి వచ్చి తన కూతురు మరణాన్ని చూసి కుంగిపోతాడు ఆ గిరిజనావాసుల సహాయంతో లక్ష్మి , పుట్టిన పాప తో తన ఇల్లు చేరుకుంటాడు .
ఇది ఏమి తెలియని రాఘవులు పని ముగించుకొని ఇంటికి వస్తాడు వచ్చి రాగానే తన అర్ధాంగి మరణాన్ని చూసి ' అయ్యో న భార్య నన్ను విడి వెళ్ళిపొయిన్ది ఎం జరిగింది అని రాఘవులు చంద్రయ్య ని అడుగుతాడు '
చంద్రయ్య జరిగిన సంఘటన చెప్తాడు.
అది వినగానే రాఘవులు కోపం తో కత్తి తీసుకొని కొండయ్య ని చంపడానికి వెళ్తాడు అది చుసిన చంద్రయ్య ఒద్దు రాఘవులు మనకి ఇంతే రాసి పెట్టి ఉంది నువ్వు వాడిని చంపడానికి వెళ్లి నీకు ఏమైనా జరగరానిది ఏదయినా జరిగితే పుట్టిన పాప అనాధ అవుతుంది.
నేను ఎన్ని రోజులు ఊంటానో నాకే తెలియదు అని చెప్పి పాప ని రాఘవులు చేతికి ఇస్తాడు చంద్రయ్య. లక్ష్మి కి చేయాలిసిన కార్యక్రమాలను చేసి ఇంటికి వస్తారు రాఘవులు, చంద్రయ్య .. పుట్టిన పాప కి రాఘవులు ' విశాలాక్షి ' అనే పేరు పెడతాడు.
కాలగమనంలో చంద్రయ్య మరణిస్తాడు. ఇప్పుడు విశాలాక్షి కి పదహారేండ్లు. విశాలాక్షి తన పేరుకు తగట్టే చాల విశాలాలంగ ఉంటుంది కానీ ఎవరైనా తప్పు చేసిన తనకి కోపం వచ్చినా భద్రకాళి ఐపోతుంది తన నవ్వు శాంతం తన కోపం ప్రళయం..
ఒక రోజు స్నానం చేయడానికి చెరువుగట్టుకి వెళ్ళినపుడు తన స్నేహితురాలిని ఏడిపించాడు విశాలాక్షి ఆలస్యం చేయకుండా అతనిని కొట్టింది. లక్ష్మి కోపాన్ని చూసి రాఘవులు కి తన కూతురు జీవితం ఎలా ఉంటుంది అని వాపోతూఉంటాడు.
ఒక రోజు రాత్రి వేళలో రాఘవులు గ్రామం వారు నిద్రిస్తుండగా హఠాతుగ్గా తుపాకులతో కలుస్తున్న శబ్దాలు వినిపించాయి.
ఆ శబ్దాలు విన్నవారు మేలుకొని బయటకి వచ్చి చూస్తారు.
కొంత మంది మనుష్యులు పరిగెడుతూ కనిపిస్తారు ఆ మనుష్యుల్ని బ్రిటిష్ వారు తరుముతుంటారు ఆ మనుష్యులు కనిపించిన ఇళ్లలోకి వెళ్లి దాకుంటారు.
బ్రిటిష్ వారు ప్రతి ఇల్లు శోధించి దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తూఉంటారు ఇలాగే రాఘవులు ఇంటికి ఒక వ్యక్తి వచ్చి దాకుంటాడు.
అతడు గాయాలతో, శరీరమంతా రక్తమయ్యింది. విశాలాక్షి బయటకు వచ్చి అతనిని చూస్తుంది. ఆమె చింతించకుండా అతడిని ఇంట్లో ఒక దాగిన చోటకి తీసుకెళ్లి రక్షించింది.
ఆ రాత్రి ఆలా గడిచిపోతుంది...
తెల్లవారాక రాఘవులు ఆ వ్యక్తి ని చూసి బాబు ఎవరు నీ వంటికి ఈ గాయాలు ఏంటి అని ప్రశ్నిస్తాడు.
అప్పుడు ఆ వ్యక్తి నా పేరు విక్రమ్ మాది పక్కనే ఉన్న వెలికొండ అనే గ్రామం నేను ఒక విప్లవకారుడిని నేను మా దళం వారు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాం.
బ్రిటిష్ వారికీ రైల్లో ఆయుధాలు వొస్తున్నాయి అని తెలుసుకొని ఆ ఆయుధాల రైల్ ను ఆడుకోడానికి మేము బయలుదేరాం, కానీ మా దళం లో ఒక్క నల్ల కుక్క బ్రిటిష్ వారికీ అమ్ముడుపోయి మేము వేసిన పథకాన్ని బ్రిటిష్ వారికీ చెప్పాడు.
మేము రైల్ వచ్చే చోటుకి వెళ్ళాం బ్రిటిష్ వారు మమల్ని చుట్టుముట్టారు వారి నుండి బయటపడడానికి మా స్వాతంత్ర్యం లక్ష్యం నెరవేర్చుకోవాలి అని వారి నుంచి తపించుకుబోయి మీ గ్రామం లో మీ ఇళ్లలో తలదాచుకున్నాం.
నేను మీ ఇంటిలోకి వచ్చాను మీ ఇంటిలో ఉన్న అమ్మాయి నేను దకోడానికి చోటు చూపించి నా ప్రాణాలు రక్షించింది అని విక్రమ్ చెప్పాడు. తన వంటికి తగిలిన గాయాలకు మందు వేసుకొని విక్రమ్ రాఘవులు ఇంట్లోనే ఉంటాడు..
అసలు ఎప్పుడు మగవారితో మాట్లాడని నా కూతురు, మగవారి ఉస్సు ఎత్తగానే మాటమార్చే నా కూతురు విక్రమ్ పై శ్రద్ధ ఎక్కవ చూపిస్తుంది ఏంటి అని రాఘవులు విశాలాక్షి ని అడుగుతాడు.
అప్పుడు విశాలాక్షి మాట్లాడుతూ "మీకు ఇదివరకే చెపుదామనుకున్న నాన్నగారు నేను విక్రమ్ ని ఇష్టపడుతున్న అని."
మూడు నెలల క్రితం నా స్నేహితురాలిని ఒకడు ఏడిపిస్తుంటే వాడిని కొట్టాను వాడు నన్ను చంపడానికి వస్తే ఈ విక్రమ్ ఏ నన్ను ఆ దుండగుడినుండి కాపాడాడు.
అప్పటి నుండి అతను అంటే ఇష్టం పెరిగింది అందుకే రాత్రి తనని మన ఇంట్లో చూసి తాను ఏదో ఆపదలో ఉన్నాడు అని గమనించి తనకు ఆశ్రయమిచ్చాను అని విశాలాక్షి రాఘవులు కి చెప్తుంది..
ఇది విన్న తర్వాత రాఘవులు తన కూతురితో ఇలా అన్నాడు 'విక్రమ్ చుడానికి బాగానే ఉన్న , తాను ఎంచుకున్న దారి నాకు నచ్చలేదు అమ్మ తాను ఒక విప్లవకారుడు తనతో ని పెళ్లి చేసి నీ గొంతు కోయలేను ని జీవితం న చేతులారా నేను పాడుచేయలేను అని అంటాడు'..
ఈ మాటలను విన్న విక్రమ్ రాఘవులు తో ఆ రోజు మీ అమ్మాయి ని చూడగానే ఇష్టపడ్డాను కానీ నేను ఉన్న సందర్భం లో తనని కలువలేకపోయాను నేను మల్లి వచ్చి చూసేసరికి మీ అమ్మాయి అక్కడ కనపడలేదు సరే అని నేను వెళ్లి పోయాను కానీ నా అదృష్టం తనని మళ్లీ ఇలా చూసాను.
మా ఇద్దరికీ పెళ్లి జరగాలి అన్నది ఆ దేవుని నిర్ణయం ఏమో అన్ని ఇల్లు ఉన్న నేను మీ ఇంట్లో దకోవడం మీ కూతురు కి న పై ఇష్టం ఉండడం చూస్తూ ఉంటె ఈ సంఘటనలు మా పెళ్లి గురించి జరిగాయి అనిపిస్తుంది' అని విక్రమ్ రాఘవులు తో అంటాడు…
నేను ఒక విప్లవకారుడినే అదే మీకు ఇబ్బంది కదా అదే ఐతే స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసారు నేను కూడా స్వాతంత్ర్యం కోసం నా ఇష్టాలను త్యాగం చేశాను అవసరమైతే న ప్రాణాలు ఐన అర్పిస్తాను కానీ ఈ పెళ్లి కోసం స్వాతంత్ర్యం లక్ష్యం మాత్రం వదులుకోను అని స్ఫష్టంగాచెప్తాడు విక్రమ్..
ఇది విన్న రాఘవులు విక్రమ్ కి దేశం పై ఉన్న భక్తి ని చూసి సంతోషిస్తాడు విక్రమ్ ని తన తల్లితండ్రుల గురించి అడుగుతాడు.
అప్పుడు విక్రమ్ నా తల్లి నాకు జన్మనిచ్చి చనిపోయిఇంది మా ఇంట్లో నేను నాన్న మాత్రం ఉంటాం .నాన్నకు కాళ్ళు లేని కారణంగా ఇంట్లోనే ఉంటారు ..
చిన్నప్పుడే నేను దళం లో చేరాను అప్పుడప్పుడు వెళ్లి నాన్నని చూసి మల్లి మా స్థావరానికి వెళ్తాను అనిచెప్తాడు ... సరే మీ ఇంటికి వెళదాం మీ నాన్న గారికి కూడా ఈ విషయం చెప్పి మీ పెళ్లి చేస్తాను అని రాఘవులు, విక్రమ్ ఇంకా విశాలాక్షి తో అంటాడు.
ఇక ముగ్గురు కలిసి విక్రమ్ ఇంటికి వెళ్తారు.. విక్రమ్ ఇంటికి వెళ్ళాక విక్రమ్ తండ్రి చిత్ర పటాన్ని చూసి నేను ఈ పెళ్లి కి ఒప్పుకో లేనమ్మా ని తల్లి చంపినా వాడి కొడుకుతో ని పెళ్లి చేయలేను అని రాఘవులు విశాలాక్షి తో చెప్తాడు.
అప్పుడు విశాలాక్షి మీరు ఎం అంటున్నారు నాకు ఎం అర్ధం కావడం లేదు నాన్న, విక్రమ్ తండ్రి మా అమ్మ ని చంపడం ఏంటి అసలు ఎం జరిగింది నాన్న అని రాఘవులు ని అడుగుతుంది విశాలాక్షి...
రాఘవులు గతం లో జరిగిన విషయాలు అన్ని చెప్తాడు అది విన్న కొండయ్య గదిలోనుంచి బయటకి వస్తాడు. కొండయ్య కి రెండు కాళ్ళు ఉండవు ఎం జరిగింది అని రాఘవులు అడుగుతాడు అప్పుడు కొండయ్య జరిగిన విషయం ఇలా వివరిస్తాడు.
''ఆ రోజు ని భార్య లక్ష్మి ని పొడిచి వేలుతుండగ కాలు జారీ లోయలో పడిపోయాను ఆ లోయలో ఉన్న సింహం నాపై దడి చేసింది ఆ దడి లో నా
రెండు కళ్ళు పోగొట్టుకున్నాను గర్భవతి తో ఉన్న స్త్రీ ఆ గర్భ గుడిలో ఉన్న దేవతతో సమానం అని తెలియక గర్భం తో ఉన్న ని భార్య ని పొడిచాను నేను చేసిన తప్పు నాకు ఈ విదంగా శిక్ష అందించింది'' అని పశ్చాత్తాప పడతాడు ..
పశ్చాత్తాపనికి మించిన ప్రాయశ్చితం లేదు పచ్యతాపం అంటే బాధ పాడడం తాను చేసిన తప్పు తెలుసుకొని బాధ పాడడం అంటే తప్పుని తొలిగించోకోవడమే అని రాఘవులు అంటాడు జరిగిన విషయాలు అన్ని మరిచి పోదాం సంతోషంగ పిల్లల పెళ్లి చేదాం అని పెద్దలు అందరు కలిసి విశాలాక్షి , విక్రమ్ ల వివాహం జరిపిస్తారు ..
విశాలాక్షి మరియు విక్రమ్ వివాహం జరిగి, ఆ గ్రామంలో సంతోషం చెలరేగింది. ప్రేమ, క్షమ, మరియు నూతన ప్రారంభానికి ఇది ప్రతీకగా మారింది.
ముగింపు.
Comments