పశ్చాత్తాపం
ప్రతి మనిషి జీవితంలో, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తారు. వాటిని గుర్తించిన తర్వాత, వారి మనసులో పశ్చాత్తాపం కలుగుతుంది. కథ విశ్లేషణ: బ్రిటిష్ పాలన సమయంలో, రాఘవులు అనే యువకుడు బ్రిటిష్ ప్రభుత్వం నడుపుతున్న విద్యుత్ శాఖలో లైన్మాన్గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అది విలాసవంతమైనది కాకపోయినా, స్థిరమైన ఉద్యోగం. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాఘవులను అతని మామగారు చంద్రయ్య తో కలిసి ఉంటాడు, చంద్రయ్య రాఘవులు ని తన సొంత కుమారుడిలా పెంచాడు. ఒక రోజు రాఘవులు పనికి వెళ్తున్న సమయంలో, కొండయ్య అనే వ్యక్తి ఆడవారితో అసభ్యగంగా ప్రవర్తించడంతో రాఘవులు కొండయ్య ని కొడతాడు. ఆ సంఘటనతో కొండయ్య రాఘవులు పైన పగ పెంచుకుంటాడు . చంద్రయ్య కి ఒక్కగానొక్క కూతురు తన పేరు లక్ష్మి. లక్ష్మి కి ఆమె బావ ఐన రాఘవులు అంటే ఇష్టం , ప్రేమ.. ఈ విషయం తెలిసి చంద్రయ్య, లక్ష్మి కి రాఘవులు కి వివాహం చేస్తాడు. చంద్రయ్య కి కొడుకులు లేకపోవడం తో తనకు ఉన్న ఇల్లు , పోలం రాఘవులు కి ఇస్తాడు. ఇలా ఆ చిన్న కుటుంభం ఎటువంటి బాధలు కష్టాలు లేక సంతోషంగ జీవిస్తుంటారు. కొద్ది రోజుల తర్వాత, లక్ష్మి గర్భవతిగా ఉండటం కుటుంబంలో మరింత ఆనందాన్ని తీసుకొచ...