ఉత్కంఠ

కొన్ని రోజుల క్రితం… ప్రీతి అనే అందమైన, చురుకైన అమ్మాయి ప్రతి రోజు లాగే కాలేజీకి వెళ్లింది. 


ఉదయం కాఫీ తాగుతూ కాంటీన్‌లో టిఫిన్ చేసింది. 


స్నేహితులతో మట్లాడుతు క్లాస్‌కి వెళ్లింది. క్లాస్‌లో టీచర్ పాఠం చెబుతుండగా, ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా ప్రీతి కళ్ళు తిరిగి పడిపోతుంది.


ఆమె చుట్టూ ఉన్న విద్యార్థులు భయంతో గాబరాగా హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. 


కానీ... హాస్పిటల్‌కి తీసుకెళ్తున్న దారిలోనే ప్రీతి శ్వాస విడిచిపెడుతుంది.


డాక్టర్లు కారణం చెప్పలేకపోతారు. తీవ్రమైన విషాదంలో మునిగిపోయిన క్లాస్‌మేట్లు, స్టాఫ్, ఫ్యామిలీ ఇంకా శోకంలో ఉండగానే ఈ మరణం ఒక రహస్యంగా మిగిలిపోతుంది.


ప్రీతి మరణం తర్వాత కాలేజీ గోడల మధ్య ఓ నిశ్శబ్దం అలముకుంది.


కొన్ని వారాల వ్యవధిలో అదే కాలేజీకి చెందిన విద్యార్దులు 'ప్రసాద్', 'ప్రణీత్', 'ప్రణీత', 'పృథ్వీ' ఆకస్మికంగా చానిపోతారు.


ఒకటి తర్వాత ఒకటి అయిదుగురు విద్యార్థులు చనిపోతారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు.


వారంతా ఒకే కాలేజీ, ఒకే వయసు వర్గం, కానీ మరణాలకు ఏ స్పష్టమైన కారణం లేదు.


కాలేజీ యాజమాన్యం ఇంకా విద్యార్థులు “ఇది వారికి జీవితంపై ఆసక్తి లేక ఆత్మహత్యలు కావచ్చు” అని అనుకుంటారు.


అలా ఒక సంవత్సరం గడిచింది...


ఆ మరణాలను ఎవ్వరూ మర్చిపోలేకపోయినా, కాలేజీ మళ్లీ యాదవిధిగ ఉండలి అనే నిశ్చయంతో, కొత్త విద్యార్థులకు స్వాగతంగా “ఫ్రెషర్స్ డే” నిర్వహించనుంది.


కళలతో, ఆటపాటలతో కళకళలాడే ఫ్రెషర్స్ డే ప్రారంభమవుతుంది.


సీనియర్స్–జూనియర్స్ మధ్య బంధం బలపడాలని ఆశిస్తూ, కాలేజీ ప్రిన్సిపాల్ ఇలా చెప్తారు:


“ఎవరైనా ర్యాగింగ్ చేస్తే, కఠినంగా శిక్షిస్తాను. మనం ఇక్కడ ఒక కుటుంబం వలె ఉండాలి.”


ఆ మాటలు వినగానే జూనియర్లు ఆశ్చర్యంతో, సీనియర్లు గౌరవంతో స్పందిస్తారు. కాలేజీ వాతావరణం మళ్లీ ఉత్సాహంగా మారుతుంది.


అలా మూడు నెలలు ప్రశాంతంగా గడుస్తాయి...


అయితే...


ఒక రోజు ఉదయం... కాలేజీలో మరో విషాదం చోటుచేసుకుంటుంది.


కొత్తగా చేరిన 'పూర్వరాజ్' అనే విద్యార్థి, హాస్టల్ గదిలో మృతుడిగా కనిపిస్తాడు.


ఈసారి, ఇది తట్టుకోలేక పూర్వరాజ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తారు:


మా కొడుకు కాలేజీకి వెళ్లిన తరువాతే చనిపోయాడు. ఇది సాధారణ మరణం కాదు!”


పూర్వరాజ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో, పోలీసులు విచారణ ప్రారంభిస్తారు.

వారు కాలేజీకి వచ్చి విద్యార్థులు, ఫాకల్టీని అడిగి, ఆధారాలు సేకరిస్తారు.


చివరికి పోలీసులు ఇది సహజ మరణమే. ఇతనికి జీవితం పట్ల ఆసక్తి లేకపోవచ్చు. కాలేజీకి సంబంధం లేదు.


ఆమాటలు అందరూ నమ్మేస్తారు. తల్లిదండ్రులు మాత్రం గుండె చీలక, బాధతో వెనుదిరుగుతారు.


కానీ...


కొన్ని రోజులు గడిచిన తర్వాత, మళ్లీ చీకటి తన నీడను విరిపెడుతుంది. ఇంకో విద్యార్థి మరణిస్తాడు. కారణం తెలియదు. తీరని మౌనం.


పోలీసులు ఏ జాడా కనిపెట్టలేరు. ఇది వరుసగా జరుగుతున్న అర్ధం లేని మరణాల పరంపర. దీంతో ప్రభుత్వం కేసును CBI ఆఫీసర్ దుర్గకి అప్పగిస్తుంది.


CBI ఆఫీసర్ దుర్గ కేసు విచారణ చేపడుతుంది.

పోలీసులు ఇప్పటివరకు సేకరించిన అన్ని వివరాలు ఆమెకు అందిస్తారు.


దుర్గ చదివినన్ని ఫైల్స్ చదివి, చూసినన్ని వీడియోలు చూసింది.

కానీ ఎటువంటి స్పష్టత రాలేదు. ఒక్క ఆధారమూ కనిపించలేదు.


అప్పుడు ఆమె "నేరం ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్లాలి. అదే నాకు సమాధానం ఇస్తుంది" అని కాలేజ్ కి వెల్తుంది.


ఆమె విచారణ ప్రారంభిస్తుంది, హాస్టల్ రూంలు పరిశీలిస్తుంది, విద్యార్థులతో మాట్లాడుతుంది.


అయితే అదే సమయంలో, ఒక్క అద్భుతమైన విషయాన్ని గమనిస్తుంది:

చనిపోయిన విద్యార్థులందరి పేర్లు ‘P’ అక్షరంతో మొదలవుతున్నాయి!


– ప్రీతి

– ప్రసాద్

– ప్రశాంత్

– ప్రణీత

– పృథ్వీ

– పూర్వరాజ్


ఈ విషయం గుర్తించి దుర్గ షాక్ అవుతుంది.

"ఇది యాదృచ్ఛికం కాదు... ఇది ఒక క్లూ."


వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలుస్తుంది. తను గమనించిన విషయాన్ని వివరించి, చనిపోయిన విద్యార్థుల పూర్తి వివరాలు అడుగుతుంది.


ప్రిన్సిపాల్, కొంత సంశయంతో కూడిన అభిప్రాయంతో, దుర్గకు వివరాలు ఇస్తాడు.


ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫైల్సను తీసుకొని దుర్గ తన ఆఫీసుకు బయలుదేరుతుంది.


ఆ ఫైల్స్ ఆమె చేతిలో ఉండగానే, ఒక్కసారిగా గాలి పెద్దగ విస్తుంది...

చేతిలో ఉన్నా ఫైల్స్ నేలపై పడిపోతాయి.


వాటిని జాగ్రత్తగా తిసుకోని, దుర్గ ఆఫీసుకు వెళ్లుతుండగా ఆమెకు తన ఇంటి పని అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది:


అమ్మా... బాబుకి ఒంట్లో బాగా లేదు, త్వరగా ఇంటికి రండి.”


దుర్గకు పెళ్లి కాలేదు. కానీ ఇప్పుడు ఆమె చూసుకుంటున్న బాబు రామయ్య, జానకి అనే దంపతుల కొడుకు. వాళ్లు ఒకప్పుడు దుర్గ ఇంట్లో పని చేసేవారు.


దుర్గ గతంలో ముంబైలో పని చేస్తున్నప్పుడు, గ్యాంగ్‌స్టర్ రషీద్ భాయ్ ని ఎన్‌కౌంటర్ చేస్తుంది.


ఆ సంఘటన కు ప్రతీకారం తీర్చుకునేందుకు, రషీద్ తమ్ముడు రఫిక్,

దుర్గ ఇంట్లో బాంబు పెడతాడు.


ఆ సమయంలో దుర్గ ఇంట్లో ఉండదు. అయితే రామయ్య, జానకి ఉంటారు వాలు తమ కొడుకుని రక్షించి ప్రాణాలు కోల్పోతారు.


ఆ సంఘటన తర్వాత దుర్గను హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

ఆ బాబు నీ తీసుకొని ఆమె హైదరాబాద్ కి వచ్చేస్తుంది. 


ప్రస్తుతం...


దుర్గ ఇంటికి ఒచ్చక బాబు నీ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. ప్రస్తుతం బాబు ఆరోగ్యం కుదుటపడుతుంది.


ఆ రాత్రి ఆమె మళ్లీ ఫైల్స్ చూస్తుండగా, ఒక ప్రత్యేకమైన పేపర్ ఆమె కంటపడుతుంది.


"నన్ను చంపేస్తున్నారు" అని పేపర్ లో రాసి ఉంటుంది!


దుర్గ ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందో  తనకి అర్దం కాదు.


దుర్గ ఆ పేపర్ తీసుకొని పరిశీలిస్తూ. అందులోని చేతిరాత పై దృష్టి పెడుతుంది.


ఈ చేతిరాత చనిపోయిన వారిలో ఎవరిదో అయితే… అది ఓ కీలక ఆధారం.” అవుతుంది అని అనుకుంటుంది.


తర్వాతి రోజు కాలేజీకి వెళ్ళి, చనిపోయిన విద్యార్థుల క్లాస్‌నోట్స్, ప్రాజెక్ట్స్, ఫ్రెండ్స్ దగ్గర డైరీస్ అన్నీ పరిశీలిస్తుంది. 


విద్యార్థులతో మాట్లాడుతుంది కానీ ఒక క్లూ దొరకదు.


నిరాషాతో తను స్టేషన్ కి ఒస్తుంది ఆమె ఒక ఆసక్తికరమైన విషయం గమనిస్తుంది. స్టేషన్‌లో ఓ వ్యక్తి ఎడమ చేత్తో రస్తుండడం.


ఆ దృశ్యం చూసిన వెంటనే దుర్గకు ఒక అలోచన వస్తుంది:

"చనిపోయినవాళ్లలో ఎడమచేతివారు ఎవరైనా ఉన్నారా?"


వెంటనే కాలేజ్ కి వెల్తుంది, అంతా పరిశీలించిన తర్వాత ఒకరి చేతిరాత మాత్రమే ఆ పేపర్లో ఉన్నదానితో పూర్తిగా సరిపోతుంది.


ఆమె ఎవరో కాదు ప్రిన్సిపాల్ కుమార్తె ప్రణీత. దుర్గ వెంటనే వెళ్ళి, ప్రిన్సిపాల్‌ను కలుస్తుంది.


"ఇది మీ కూతురి చేతిరాత కదా సార్?” అని అడుగుతుంది.


ప్రిన్సిపాల్  "కాదు ఈది నా కూతురు చేతిరాత కాదు" అని చెప్పి అక్కడనుండి వెళ్లిపోతాడు.


అల వెల్తున ప్రిన్సిపాల్‌ను మౌనంగా దుర్గ ఫాలో అవుతుంది.


ప్రిన్సిపాల్ తన ఇంటికి వెళ్లి తన గదిలో నుండి తయారు చేసుకున్న సీక్రెట్ గదిలో కి వెళ్తాడు. అది గమనించిన దుర్గ ప్రిన్సిపాల్ వెనువెంటనే వెళ్తుంది . 


అ గదిలో ప్రిన్సిపాల్ లాగా ఇంకో వ్యక్తి ఉంటారు అది చుసిన దుర్గ ఆశ్చర్యపోతుంది. ప్రిన్సిపాల్ ఇంకా అతని తమ్ముడు ఒకేలాగా ఉంటారు . 


ప్రిన్సిపాల్ తమ్ముడు మంచివాడు కాదు. అన్నయ ఆస్థి తీసుకుందాం అని ఆలోచనతో అతనిని బందించి అతని స్థానంలోకి ప్రిన్సిపాల్ గా కాలేజీ కి వస్తాడు . 


కాంటీన్ వారితో కలిసి కాంటీన్ లో తినే విద్యార్థులకి విషం పెట్టి వారిని చంపేస్తారు. డాక్టర్ తో మాట్లాడి చనిపోయియినా వారిది సహజమరణమే అని చూపిస్తాడు. ఇలా చేస్తే కాలేజీ మూతపడిపోతుంది అ స్థలం లో పెద్ద హోటల్ కట్టి ఇంకా డబ్బులు సంపాదించాలని ప్రిన్సిపాల్ తమ్ముడి ఆలోచనా.


దొంగ ప్రిన్సిపాల్ అసలైన ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ "నా గురించి తెలిసిపోయింది అని నీ  కూతురిని నీ అక్కడే అ రోజే అదేగదిలోనే చంపేస  కానీ నీ కూతురు చాల తెలివిగా తనని చంపేస్తున్నారని పేపర్ లో రాసి అదే గదిలో స్టూడెంట్స్ లిస్ట్ లో దాచిపెట్టింది అది నేను చూసుకోకుండా అ పేపర్స్ ని  సిబిఐ ఆఫీసర్  దుర్గ చేతికి ఇచ్చాను.


చంపే వారి పేర్లు P అనే అక్షరంతో మొదలవుతుంది అని నేను గమనించలేదు. ఇప్పుడు దుర్గ కి నా పైన అనుమానం ఒచ్చింది. నువ్వు నా స్థానంలోకి వెళ్లి సిబిఐ ఆఫీసర్ దుర్గకి దొరికిపోవాలి అప్పుడు నువ్వు జైలు లో ఉంటావ్, నేను ని తమ్ముడు గా బయట పడతా నీ కాలేజీ ఉన్న స్థలం లో నేను హోటల్ కడతాను. నేను చెప్పింది చేయకపోతే నీ కొడుకుని కూడా చంపేస్తాను" అని అంటాడు.


ఈ విషయాలు మాట్లాడుతుండగా దుర్గ ప్రిన్సిపాల్ పై దడి చేస్తుంది. అ దడి లో దుర్గ అసలైన ప్రిన్సిపాల్ ని కాపాడి దొంగ ప్రిన్సిపాల్ ని చంపేస్తుంది.


తర్వాత రోజు…


విద్యార్థులు నవ్వులమధ్య నడుచుకుంటూ కాలేజీకి వస్తుంటారు.


దుర్గ ఆకాశాన్ని చూసి మౌనంగా మురిసిపోతుంది “ప్రణీత… నువ్వు చనిపోయినా… నీ నిజాన్ని వెలికి తెచ్చావు.” అని అనుకుంటుంది. 


ఇది కేవలం కేసు కాదు. ఇది నిజం కోసం నిస్వార్థంగా నడిచిన ఒకదారి.

ముగింపు...

Comments

Popular posts from this blog

A Journey of Love

ఒక తండ్రి కన్న కల

బెంగళూరు రహస్యం