ప్రయాణం

ప్రయాణం అంటే ప్రతి ఒక్కరు ఉల్లాసంగా ఉత్సహంగా గడిపే విషయం. కానీ ఒక ప్రయాణం భయం తో భక్తి తో గడిపితే ఎలా ఉంటుంది.. ఈ విషయం ఫై న ఈ కథ ఉంటుంది..

కృష్ణ తన చదువు పూర్తి చేసి కాల్ సెంటర్ లో జాబ్ చేస్తు ఉంటాడు. 

ఒకరోజు తన స్నేహితుడు ఢిల్లీలో ఒక జాబ్ ఉంది జీతం 1 లక్ష నెలకి. నీకు ఓకే ఐతే నేను నా ఫ్రెండ్ తో మాట్లాడి నీకు జాబ్ ఒచ్చేలాగా చూస్తా అని అంటాడు.

ఢిల్లీలో జాబ్ కదా అని సరే అని అంటాడు కృష్ణ.

ఇక్కడ విషయం ఏంటి అంటే కృష్ణ కుటుంబం అప్పులో కూరుకుపోయి ఉంటుంది. ఇంటి భాద్యదాతలు కృష్ణ మీద ఉంటుంది.. కృష్ణ తండ్రి పని చూస్తున్న కానీ తన తండ్రి కి రిటైర్మెంట్ ఇచ్చి ఉన్న అప్పులు తీర్చేసి ఒక సొంత ఇల్లు, ఆ ఇంట్లో అమ్మ నాన్న ని సంతోషంగా చూసుకోవాలి అనే కోరిక, సంకల్పం తో ఉంటాడు.

కృష్ణ ఎవరిని మోసం చేయకుండ నిజాయితీ గా ఉండాలి అని అనుకుంటాడు. కృష్ణ  కి తెలుసు తన కుటుంబ పరిస్థితి “ఐనా సరే నేను ఏది ఏమైనా నీతి నిజాయితీ ని వదలను అని కచ్చితంగా అనుకుంటాడు”.

తను చదివిన చదువుకు ఉద్యోగం రావాలి అంటే టైం పడుతుంది ఇంకా వేరే కోర్సు చేయాలి. అలా కోర్సు చేయాలి అంటే డబ్బు కావాలి. తను ఇప్పుడు చేస్తున్న కాల్  సెంటర్ జాబ్ కూడా నచ్చదు, కాల్ సెంటర్ జాబ్ తనకి కరెక్ట్ గా అనిపించదు. 

ఆ సమయం లో స్నేహితుడు ఢిల్లీ జాబ్ గురించి చెప్పడంతో సరే అని తన స్నేహితుడికి చెప్తాడు.

వారం రోజుల తర్వాత ఢిల్లీ నుండి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది.

ఇంటర్వ్యూ మోతం ఫోన్ లో ఉంటుంది.

ఇంటర్వ్యూ సమయం లో ఇ జాబ్ 10am to 5pm ఉంటుంది. మనం కస్టమర్ అడిగే ప్రశ్నల కు సమాధానం ఇవ్వాలి వారికి సహాయ చేయలి, టెక్నికల్ వర్క్ ఉంటుంది అని చెప్తాడు .

ఇంటర్వ్యూ అయిపోతుంది. జాబ్‌ కి సెలెక్ట్ అయ్యావ్ అని ఇంటర్వ్యూ తీసుకున్నా వ్యక్తి  కృష్ణతో చెప్పాడు.

తన తల్లితండ్రులకు విషయం చెప్పి, ఢిల్లీలో ఉద్యోగం కోసం వెలతాడు.

26 గంటాల ప్రయాణం తర్వాత కృష్ణ ఢిల్లీకి చేరతాడు. ఢిల్లీ లో ట్రైన్ దిగి తనకి కాల్ చేసిన వ్యక్తి కి కాల్ చేసి అడ్రస్ ఎక్కడ అని అడుగుతాడు. 

మాట్లాడిన వ్యక్తి ఆఫీస్‌, ఢిల్లీలో కాదు గాజియాబాద్‌లో అని చెప్తాడు.

ఢిల్లీ నుండి మెట్రో రైలులో రవాలి అని ఒక ప్లేస్ చెప్తాడు. అదీ సరిగ్గా ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి 1:30 గంటలు పడుతోంది. 

మొదటిసారి కృష్ణ ఢిల్లీ వెళ్ళడం. అక్కడ మెట్రో స్టేషన్ ఎక్కడో తెలుసుకొని వేలాదం అని బయటికి వస్తాడు.

కృష్ణ ఒక ఆటో దగ్గరకి వెళ్లి అడుగుతాడు. కనీ కృష్ణ కి తెలియదు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి మెట్రో స్టేషన్ కి వెళ్ళొచ్చు అని. ఇ విషయం తెలియక ఆటో కి 200 రూపాయలు ఇస్తాడు.

ఆటో దిగిన తర్వాత ఈ విషయం కృష్ణ కి అర్దం అవుతుంది.

ఇంకా జాగ్రత్తగ ఉండాలి అని మాసులో అనుకోని మెట్రో లోపలికి వెళతాడు. 

హైదరాబాద్ లో మెట్రో రైలు ఎక్కని కృష్ణ మొదటిసారి ఢిల్లీలో మెట్రో రైలు ఎక్కుతాడు. 

తనతో ప్రయాణం చేస్తున్న ఒకరితో తను దిగల్సిన స్టేషన్ ఎప్పుడు ఒస్తుంది అని అడుగుతాడు.

ఆ వ్యక్తి మెట్రో రైల్ లో ఉన్నా మ్యాప్ నీ ఫాలో అవ్వు అని చెప్తాడు.

సరే అని కృష్ణ మ్యాప్ ని చూస్తు, చుట్టు ఉన్నా ప్రాంతం చూస్తు ఉంటాడు.

ఒక గంట తర్వాత కృష్ణ దిగాల్సిన స్టేషన్‌ వస్తుంది. 

మెట్రో దిగి రోడ్డు వద్దకి ఓస్తాడు. తనకి కాల్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి ఎక్కడికి రావాలి అని అడుగుతాడు.

ఆ వ్యక్తి ఒక ప్లేస్ చెప్పి ఆటో ఎక్కి రమ్మని చెప్పాడు. 

కృష్ణ ఆటో ఎక్కి బయలుదేరుతాడు. ఓక 40 నిమిషాల తర్వాత తను చేరవలసిన చోటు ఒస్తుంది. 

ఆటో దిగి కృష్ణ ఆ వ్యక్తి కి ఫోన్ చేసాడు. అప్పుడు ఆ వ్యక్తి మా మనిషి అక్కడ ఉన్నారు. తన నంబర్ ఇస్తాను తనకి ఫోన్ చేసి తనతో రూమ్ కి వెళ్ళండి. నేను ఒచ్చి ఆఫీస్ కి తిసుకెళ్తా అని అంటాడు.

అక్కడ ఒక వ్యక్తి కృష్ణ కోసం చూస్తు ఉంటాడు.

కృష్ణ తన కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి కి ఫోన్ చేసాడు అలా వల్లిద్ధరు కలిసి రూమ్ కి వెళతారు.

రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వేలాదం అని వెయిట్ చేస్తు ఉంటాడు. 

ఈరోజు ఆలస్యం అయింధి రేపు ఉదయం వేలాదం అని తనకి ఫోన్ చేసిన వ్యక్తి కృష్ణ తో అంటాడు.

తర్వత రోజు:-

ఆఫీస్ లో రిపోర్ట్ చేసి డాకుమెంట్స్ సబ్మిట్ చేసి ఆఫీసు వాతావరం చూస్తాడు.

అసలు అదీ ఆఫీస్ కాదు ఒక ట్రైనింగ్ సెంటర్ బిజినెస్ ఏలా పెట్టాలి దానికి ఏం కావాలి ఏలా మాట్లాడాలి అని నేర్పిస్తారు. 

ట్రైనింగ్ అయినా తర్వాత వాలే ఓక స్టోర్ ఇస్తారు. పెట్టుబడి వస్తువులు వారివి కాని స్టోర్ లో మాత్రం మనమే ఉండలి. ఓకా ఫ్రాంచైజ్ లగా.

సరే ఒచ్చినందుకు ఏధో ఒక్కటి చేయాలి అని కృష్ణ అక్కడ ఉంటాడు.

తర్వాత రోజు నుండి 5 డేస్ ట్రైనింగ్ కి అటెండ్ అవుతాడు..

ట్రైనింగ్ లో ఉన్నపుడు కృష్ణ కి ఒక విషయం తెలుస్తుంది.

ఫ్రాంచైజ్ కోసం అ బిజినెస్ కి 10000 నుండి 50000 డబ్బు కట్టాలి అని కంపెనీ వాళ్ళు  చెప్తారు.

ఇంటర్వ్యూ అప్పుడు తనకి ఢిల్లీకి రమ్మని చెప్పిన వ్యక్తి కృష్ణ కి ఈ విషయం ఏం చెప్పడు. 

కృష్ణ నీ ఒప్పించడానికి ఇంకా డబ్బులు కట్టమని ఆ వ్యక్తి చెప్తాడు.

కృష్ణ  తన ఇంటి పరిస్థితి తన కి ఉన్న అప్పులు అన్ని తెలుసు. మల్లి ఈ డబ్బులు కోసం కొత్తగా అప్పు చేయాలి నాకు ఈ జాబు వద్దు బిజినెస్ వద్దు అని అనుకు కొని తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతాడు.

ఇంటికి వెళ్లి డబ్బు తేస్తా అని తన రూమ్‌మేట్ తో చెప్పి ఆన్‌లైన్‌లో సికింద్రాబాద్ కి రైలు టికెట్ బుకింగ్ చెస్తాడు. 

అప్పుడే మన ప్రదాని మోడీ గారు డీమోనిటైజేషన్ నీ స్టార్ట్ చేస్తారు.

ATM లో డబ్బు లేదు, కొన్ని బ్యాంక్ లు మాత్రమే ఓపెన్ ఉన్నాయ్. అవి కూడ పరిమిత సమయాలు. 

ఆది కుడా కృష్ణ ఉన్నా ప్లేస్ లో బ్యాంక్ ఎ ఓపెన్ చేయలేదు.

కృష్ణ తీసికెళ్ళిన డబ్బులో 2500 రూపాయలు మాత్రం మిగిలి ఉంటాయి. 800 తో ట్రైన్ టికెట్ ఆన్ లైన్ లో బుక్ చేస్తాడు.

ఇంకా 1200 రూపాయలు ఉంటాయి. 200 రూపాయలు తన పర్స్ లో మిగితా 1500 రూపాయలు తన బ్యాంకు అకౌంట్ లో ఉంటాయి.. 

ఢిల్లీ నుండి ట్రైన్ 5:30 గాంటలకి మొదలువుతుంది. కృష్ణ తన రూమ్ నుండి 1:00 గాంటలకి బయలుదేరుతాడు.

70 రూపాయలు తో భోజనం చేస్తాడు, ఇంకా 130 రూపాయలు ఉంటాయి.. ఆటో ఇంకా మెట్రో ట్రైన్ ఛార్జ్ కి కలిపి 65 రూపాయలు ఐపొతాయాయి..

ఆన్ లైన్ టికెట్ ఉంది అనే ధీమా తో మిగితా 65 రూపాయలతో ప్రయాణం చేదాం అని అనుకుంటాడు..

స్టేషన్ కి 4:30pm వరకు వస్తాడు. ట్రైన్ 5:15pm కి వస్తుంది కృష్ణ ట్రైన్ ఎక్కి నిల్చుంటాడు. 

ఆన్ లైన్ ట్రైన్ టికెట్ బుక్ చేసినందు వలన ఆ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది టికెట్ కలెక్టర్ వస్తే సీట్ అడుగుదాం అని అనుకుంటాడు. ట్రైన్ స్టార్ట్ ఐన 10 నిమిషాలకు టికెట్ కలెక్టర్ వస్తారు. కృష్ణ ఎంతో ఉత్సహంగా తన టికెట్ ని చూపిస్తాడు అ టికెట్ చుసిన TC ఈ టికెట్ చెల్లదు ని డబ్బులు నీ బ్యాంకు అకౌంట్ లోకి రిటర్న్ ఒస్తాయ్ అని చెప్తాడు

కృష్ణ కి షాక్ నిన్న టికెట్ ఆన్ లైన్ లో తీసుకున్న, నా దగ్గర డబ్బులు కూడా లేవు అని అంటాడు.. కానీ TC నాకు ఎం సంబధం లేదు డబ్బులు ఉంటె టికెట్ తీసుకో లేదా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపో అంటాడు.. కృష్ణ నేను ఎందుకు దిగాలి అని ఆన్ లైన్ లో టికెట్ తీసుకున్న నేను దిగాను అని TC తో అంటాడు. కానీ TC లేదు నువ్వు ముందుకు వేళ్ళు దిగు అని చెప్తాడు.  

అలాగే ముందు కంపార్ట్మెంట్ లోకి వెళ్తూ ఉంటాడు  కృష్ణ అలా వెళ్తూ ఉండగా ఒక దగ్గర  సీట్ కాళీ గా ఉంటుంది కూర్చొని తన దగ్గర ఉన్న టికెట్ పక్కన వాళ్ళకి చూపిస్తాడు.. ఈ టికెట్ చాలు సరిపోతుంది TC  వస్తే నేను మాట్లాడతాను అని పక్కన ఉన్న చెప్తారు.. 

అలాగే మాట్లాడుతూ తన దగ్గర డబ్బులు లేవు అని ఢిల్లీ వచ్చిన కారణం ఏంటి అని చెప్తూ ఉండగా TC   వస్తాడు అక్కడ ఉన్నవాళ్లు కృష్ణ పరిస్థితి TC కి వివరిస్తారు TC ఎం చెప్పకుండా వెళ్లి పోతాడు..

పక్కన ఉన్న వాళ్ళు తెచ్చుకున్న భోజనం లో కృష్ణ కి కొంత పెడతారు ఆది తినేసి అక్కడే భయం తో ఉంటాడు..

ట్రైన్ మహారాష్ట్ర మీదుగా వెళ్తుంది. బలార్షా లో నేను దిగుతా అని ఎవరో ఒక వ్యక్తి చెప్తుండుగా కృష్ణ వింటాడు.. 

ఈ బలార్షా అనే ఊరు కృష్ణ కి తెలుసు. తన ఫ్రెండ్ పెళ్లి మంచిర్యాల లో ఉంటే బలార్షా అనే ట్రైన్ లోనే వెళ్తాడు.

కాని బలార్షా ఊరు చేరుకోవాలి అంటే తరువాత రోజు 2:00pm అవుతూంది.

ఆ రాత్రి మొత్తం నిద్ర లేక కృష్ణ భయం తో ఉంటాడు.

తెల్లవారింది బ్రష్ కూడా చేయకుండా పైన ఉన్న సీట్ లోనే ఉంటాడు కృష్ణ.

కృష్ణ కి దేవుడి భక్తి ఎక్కువ గా ఉంటుంది "ఓం నమో నారాయణ" అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు.  

9:00am లేదా 2:00pm కి TC వస్తాడు అని అనుకుంటాడు కృష్ణ.

కానీ TC  11:00am గంటలకు ఒచ్చాడు కృష్ణ  TC వచ్చినపుడు ఫై సీట్ లో ఆలా కళ్ళు మూసుకొని "ఓం నమో నారాయణ” అని మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు.

అప్పుడు కృష్ణ కి భోజనం పెట్టిన వాళ్ళు పైన ఉన్న సీట్ మాది అని చెప్పగానే TC వెళ్ళిపోతాడు...

టైం 1:00pm గంటలు అవుతుంది "Your online ticket has been cancelled. Money will be refunded to your account" అని మెసేజ్ ఓస్తుంది..

అ మెసేజ్ చూడగానే కృష్ణ కి చమటలు పట్టేస్తాయీ. తరవాత స్టేషన్ ఎదయినా సారె అక్కడ దిగి తనకి తెలిసిన బలార్ష కి వెళ్ళాలి అని అనుకుంటాడు.

తనకు భోజనం పెట్టిన వారికీ థాంక్స్ చెప్పి నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాడు..

కృష్ణ దిగిన స్టేషన్ చంద్రాపూర్. బలార్షా అక్కడి నుండి 120km ఉంటుంది, అని బయట ఉన్న ఆటో డ్రైవర్ ద్వారా తెలుసుకుంటాడు. అదే ఆటో డ్రైవర్ దగ్గర ATM ఎక్కడ ఉంటుందో తెలుసుకొని అక్కడికి   వెళ్తాడు.

తాను వెళ్లిన ATM పని చెయాయడం లేదు వెరే ATM లో నో కాష్ బోర్డు ఉంది. తెలియాయని ఊరు లో దిగాను డబ్బులు కూడా లేవు అని భాద పడతాడు.

అప్పుడే కృష్ణ కి ఒక ఆలోచన వస్తుంది తన దగ్గర చెక్ బుక్ ఉంటుంది.. సెల్ఫ్ చెక్ 1000 రూపాయలకు రాసి బ్యాంకు కి వెళ్తాడు..

అలా ఆకాలితో నీరసంతో కొన్ని KM లు నడుచుకుంటూ బ్యాంకు కి వెలతాడు.

డీమోనిటైజేషన్ వల్ల బ్యాంకులో చాలా పెద్ద క్యూ ఉంటుంది టోకెన్ తిసుకోవలి. టోకెన్ తీసుకున్న ఆ రోజు డబ్బు ఇస్తారు అని కన్ఫర్మ్ గా తెలియదు.

బ్యాంక్ పక్కాన ATM ఉంటే అక్కడ డబ్బు కోసం ప్రయత్నం చెస్తాడు. కనీ డబ్బు ఉండదు.

నీరసంతో బ్యాంకు వద్ద ఉన్నా క్యూలో నిలపడి ఉంటాడు.

తన టోకెన్ రావడానికి 2 గంటలు పడుతుంది. బ్యాంకు లో ఒక వ్యక్తి కృష్ణ నీరసంగా ఉండడం చూసి లోపలికి తీసుకు వెళ్లి ఒక సమోసా ఇంకా టీ వాళ్ళ సెక్యూరిటీ తో చెప్పి తెపిస్తాడు..

కృష్ణ సమోసా తిని, టీ తాగి అతని కి సహాయం చేసిన బ్యాంకు వ్యక్తి కి థాంక్స్ చెప్పి, డబ్బులు తీసుకోని బస్సు స్టాప్ కి వస్తాడు.

బస్సు స్టాప్ లో అతనికి తెలిసిన బలార్షా బస్సులు ఎప్పుడు వస్తాయి అని తెలుసుకొని అ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. 5:40pm కి కృష్ణ ఎక్కవలిసిన బస్సు వస్తుంది. అ బస్సు ఎక్కి తెలంగాణ లో ఆసిఫాబాద్ ఆనే బస్సు స్టాప్ కి రాత్రి 9pm గంటల వరకు వస్తాడు.. 10pm గంటలకు హైదరాబాద్ బస్సు వస్తుంది అని విచారణ చేసుకొని బస్సు కోసం చూస్తాడు..

బస్ ఒచ్చే వరకు తను డిన్నర్ చేసి రెడీ గా ఉంటాడు. 

టైం 10pm బస్సు వస్తుంది కృష్ణ హ్యాపీ గా సీట్ లో కూర్చొని హైదరాబాద్ తన ఇంటికి వెల్లాడు.

సారాంశం:-  దేవుడి మంత్రాన్ని జపిస్తే కృష్ణ కి తన చుట్టూ ఉన్న వారి సహాయం దొరికింది. కాబట్టి దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. మనం దేవుడి ఫై నమ్మకం పెట్టుకోని మంచి పనులు చేస్తే ఎప్పటికి మనకి మంచి జరుగుతుంది. నీతి గా నిజాయితీ గా మన జీవితమ్ లో ఉంటే దేవుడి మన కష్ట సమయాల్లో సహాయం చెస్తాడు.

"ఓం నమో నారాయణ”

స్వస్తి.

Comments

Popular posts from this blog

A Journey of Love

ఒక తండ్రి కన్న కల

బెంగళూరు రహస్యం