రాము: సత్యం మరియు న్యాయం కోసం చేసిన ప్రయాణం
రాము ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు.
రోజూ ఒకటే పని పత్రికల్లో, ఆన్లైన్లో ఉద్యోగాల కోసం వెతకడం, రెజ్యూమ్ పంపడం, ఇంటర్వ్యూలకు హాజరవడం.
కానీ ఎక్కడికెళ్లినా “మీ స్కిల్స్ సరిపోవు”, “మేము ఇప్పటికే వేరే వారిని సెలెక్ట్ చేసేశాం” “తరువాత చూస్తాం.” అన్నే సమాధానాలు.
తన స్నేహితుడు ఒకడు రాముకి దొంగ సర్టిఫికెట్లు పెట్టు ఉద్యోగం చూపిస్తా అని చెప్తాడు.
కని రాము దానికి ఒప్పుకోడు. తనకీ అదృష్టం లేకపోయిన ఇలా దొంగ దారిలో ఉద్యోగం తెచ్చుకోవడం నచ్చదు.
చిన్నా ఉద్యోగం అయినా సరే తన నైపుణ్యాలకి సరిపోకపోయిన సరే కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం ఏప్పాటికి ఉంటుంది అని అనుకుంటాడు.
ఒక రోజు ఉదయం, తను అప్లై చేసిన ఓ చిన్న కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఆశతో, భయంతో ఇంటర్వ్యూకు వెళతాడు. ఇంటర్వ్యూలో బాగానే మాట్లాడతాడు. కానీ ఆ ఉద్యోగం లో సెలెక్ట్ అవ్వడు.
ఆవేదనతో ఇంటికి బయలుదేరిన రాము, బస్సులో నిశ్శబ్దంగా కిటికీ బయట చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాడు.
అతడి స్టాప్ వచ్చేస్తుంది. నెమ్మదిగా లేచి దిగుతుండగా "రాము నువ్వేనా?" అని అరుస్తూ ఇద్దరు పోలీసులు వస్తారు. ఆశ్చర్యంతో తిరిగి చూసిన రాము, "అవును" అని అంటాడు.
పోలీసులు అతడిని బలవంతంగా పట్టుకుని పోలీస్ వాహనంలోకి తోస్తారు.
రాము: "ఏమైంది? నేను ఏమి చేయలేదు సార్? ఎందుకూ నన్ను తిసుకేళ్తునాారు?!"
పోలీసులు: "నీవు చేసిన తప్పులు మాకు తెలుసు. స్టేషన్లో చెప్పాం."
రాముకు ఏం జరిగిందో తెలియదు. అతడు నిజంగా ఏదైనా పొరపాటు చేశాడా? లేక ఇది ఏదైనా మిస్టేక్?
రామును స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు, అతనిపై విచారణ ప్రారంభిస్తారు.
ఇన్స్పెక్టర్ శేఖర్: "రామూ… ఈ వీడియో చూడు. ఇది నువ్వే కదా?"
రాము ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ వీడియోలో ఉన్నది నేనే.
ఆ వీడియోలో బస్స్టాండ్లో ఓ బ్యాగ్ ఉంచి వెళ్లిపోతున్నట్టు కనిపిస్తుంది. ఆ బ్యాగ్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాము: ఆ వీడియోలో ఉన్నాది నేనే కానీ ఆ బ్యాగ్, దాంట్లో ఉన్న వస్తువులు నావి కాదు.
పోలీసులు నమ్మరు. కానీ SI అఖిల్ మాత్రం రామును అటెన్షన్తో గమనిస్తుంటాడు. అతను రాములోని భయాన్ని, సత్యాన్ని గుర్తిస్తాడు.
SI అఖిల్ రాముతో మాట్లాడుతాడు:
SI అఖిల్: రామూ, నిజం చెప్పు. ఎక్కడెక్కడకి వెళ్లావు? ఎవ్వరితో కలిశావు? ఎవడైనా నీ దగ్గర బ్యాగ్ పెట్టాడా?"
అప్పుడు రాము గుర్తు చేసుకుంటాడు "ఇంటర్వ్యూ అయిపోయాక బస్స్టాండ్లో ఓ వ్యక్తి తాను పడిపోతున్నట్లు నటించి, తన బ్యాగ్ రాము దగ్గరే పెట్టి, "నాన్నగారికి ఫోన్ చేసి వస్తా" అని వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ నాకు కనిపించలేదు. నా బస్సు ఒచ్చింది అని నేను ఆ బ్యాగ్ అక్కడే ఒదిలేసి బయలుదేరాను."
అఖిల్కు అర్ధమవుతుంది ఇది ఒక పెద్ద కుట్ర అని.
పోలీస్ లు రాము, తల్లిదండ్రులు ని పిలిపిస్తారు. రాముని ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులు టెన్షన్ అవుతారు.
అసలు ఏం జరిగింది అని రాము వాళ్ళ నాన్న అడుగుతారు.
SI అఖిల్ జరిగిన విషయాలు చెప్తాడు. ఇప్పుడు ఈ విషయం లో మీరు ఏం చేయలేరు రేపు కోర్టు కి తిసుకేళ్తాం. మీరు మీకు తెలిసిన న్యాయవాది తో మాట్లాడితే మంచిది అని SI అంటారు.
SI అఖిల్, రాము తల్లిదండ్రులు ఇంకా స్నేహితులు నిజాన్ని నమ్మినా, కేసులోని ఆధారాలు రాముని తప్పించుకోవటానికి సరిపోవు. కోర్టు అతనికి జైలు శిక్ష విధిస్తుంది. రాముని జైలుకు తరలిస్తారు.
సంధ్యా (రాము ప్రేమించిన అమ్మాయి), అతని పట్ల ఎంతో నమ్మకంతో ఉండేది. రాము విషయం తెలిసి బాధ పడుతోంది, రాముని జైలులో నుండీ బయటకి తిసుకురడానికి ఎంతో ట్రై చేస్తుంది.
కని మత్తు పదార్ధాల కేసు కాబట్టి జైలు నుంచి బయటకి తీసుకురాలేకపోతోంది.
అలా ఒక 1 సంవత్సరం గడిచిపోతుంది.
రాముకి శిక్ష పడిన వార్త విన్న సంధ్య తల్లిదండ్రులు "రాము ఇప్పుడూ ఒక నేరస్తుడు… మన పరువు పోతుంది" అని ఆమెను వేరే వారిని పెళ్లి చేసుకోమని అంటారు.
ఆ తర్వాత రోజు సంధ్య, రాము నీ కలవడానికి వెళుతోంది. తన ఇంట్లో జరిగిన విషయం రాము తో చెప్పింది.
తనని నమ్ముకున్న వాళ్ల కోసం ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది..
తన తల్లిదండ్రులు చెప్పినట్టు వేరే అబ్బాయి నీ పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంటుంది.
సంధ్యా నిర్ణయాన్ని రాము కూడా అంగీకరించాడు. కొద్ది నెలల్లోనే ఆమె పెళ్లి జరుగుతుంది.
రాము జైలులో దుఃఖంతో, కోపంతో కాలం గడుపుతాడు.
5 సంవత్సరాలు ఒక్కో రోజు ఒక శిక్ష. కాని అదే సమయంలో అతను పుస్తకాలు చదవడం మొదలుపెడతాడు. స్వీయ పరిణామం కోసం అధ్యయనం చేస్తాడు. లోపాలను అంగీకరిస్తూ, కొత్త జీవితాన్ని ఊహిస్తూ తనను తీర్చిదిద్దుకుంటాడు.
అతని లోపల ఒక కొత్త వ్యక్తి పుడతాడు. తపనతో, త్యాగంతో, నిజాయితీతో నిండిన వ్యక్తి.
ఐదేల శిక్ష అనంతరం, జైలు గేటు ఓపెన్ అవుతుంది. రాము నెమ్మదిగా బయటకు అడుగుపెడతాడు. ఆకాశాన్ని చూస్తాడు ఒక కొత్త ప్రారంభం కోసం.
ఇంటికి వచ్చిన రాము, తల్లిదండ్రులను కోల్పోయాడన్న వాస్తవం తెలుసుకుంటాడు.
రాము తనను కోల్పోయినవాళ్ల కోసం కాదు… తన మానవత్వం కోసమే బ్రతకాలని అనుకుంటాడు.
తన ప్రేమను, బాధను, కోపాన్ని సేవలో మార్చి, జీవితం అర్థవంతంగా తీర్చిదిద్దుకుంటాడు.
ఇక అతనికి ఒక్క గమ్యం తన జీవితాన్ని విలువైనదిగా మార్చడం. ఇతరులకోసం, సమాజంకోసం తను కోల్పోయినవారికి అర్పణగా జీవించడం.
SI అఖిల్ ఇంకా తన స్నేహితులా సహాయంతో రాము "అమాయకుల కోసం న్యాయం" అన్న పేరుతో ఓ NGO ప్రారంభిస్తాడు.
జైలులో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వారికి సహాయం చేస్తూ, తన అనుభవాన్ని మార్గదర్శనంగా చేస్తూ జీవిస్తాడు.
ఒక రోజు, తన కార్యక్రమానికి అతని పాత స్నేహితులందరూ వస్తారు.
ఆలోచనలో ఉంటూ చూసిన ఆ ముఖాల్లో సంధ్యా కూడా ఉంటుంది. పెళ్లయినవిడ, ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఆ కళ్లలో ఇప్పటికీ ఆ గౌరవం, ఆ స్నేహం కనిపిస్తుంది.
రాము ఒక చిరునవ్వుతో ఆమెను చూస్తాడు.
"మీరు సంతోషంగా ఉండాలి… అధే నాకు సరిపోతుంది." అని అంటాడు.
NGO ప్రారంభించిన కొన్ని నెలల తరువాత…
ఒక రోజు రామును కలుసుకోడానికి ఒక యువతి వస్తుంది.
ఆమె పేరు అన్విత న్యాయశాస్త్రం చాదివినా విద్యార్థిని, సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో జీవించే వ్యక్తి.
అన్విత: "మీ గురించి తెలుసుకున్నాను సార్… మీ NGO ద్వార మీరు చేస్తున్న పనులు నాకు ఒక స్పూర్తినిచ్చాయి.
నేను మీతో కలిసి నడవాలి అని అనుకుంటున్నాను మీ ఆదర్శాలు నాకు నచ్చాయి ఓక లాయర్ గా నా వతు సహాయం నేను మీకు చేయలని ఆశిస్తున్నాను.
రాము: సరే అన్విత మీరు మాతో ఉండొచ్చు.
అన్విత: అయితే మీరు ఓ మార్గదర్శకుడు… మీ వెంట నేను.
ఇదే మొదలు. ఇద్దరి మధ్య ఆలోచనలు కలుస్తాయి, లక్ష్యాలు కలుస్తాయి.
కొన్నాళ్లలో అన్విత రాములో ఉన్న బాధను, గంభీరతను, చినుకుల వెనుక ఉన్న గాఢమైన ప్రేమను అర్థం చేసుకుంటుంది.
ఒకరోజు ఆమె నెమ్మదిగా రామునీ ఇలా అడుగుతుంది: "మీ గతం నన్ను భయపెట్టదు… కానీ మీ భవిష్యత్తులో నాకు చోటుంటుందా?"
రాము కళ్లలో ఆశ్చర్యం, కృతజ్ఞత, ఆనందం కలగలిసి వస్తాయి.
"నీవు నా జీవితంలో వెలుగంతా నింపినవు అన్విత… నీతో నడవడానికి నేను సిద్ధమే." అని అంటాడు.
వీరిద్దరి పెళ్లి సనిహితుల సమక్షములో ఎంతో సత్యంగా, సంతోషంగా జరుగుతుంది. రాముకు ఇది నిజంగా కొత్త జీవితానికి అంకురార్పణ.
కొన్ని సంవత్సరాల్లో వాళ్లకి ఇద్దరు పిల్లలు:
ఒక అబ్బాయి: ధర్మ
ఒక అమ్మాయి: దియా
రాము పిల్లల్ని చూస్తూ తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటాడు.
ఇంట్లో నవ్వులు, పటాకులు, పుస్తకాలు, సేవ అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
జీవితంలో అదృష్టం తిరిగి రావడం, ఒకరోజు ఒక పెద్ద కంపెనీ CEO, రామును కలుస్తాడు.
CEO: "మీ జీవితం ఒక పాఠం… మీ సేవ ఒక మార్గదర్శకం. మీ NGOకి మేము ప్రతిమాసం విరాళం ఇస్తాం. అలాగే మేము మీకో ప్రతిష్ఠాత్మకమైన 'జీవిత గౌరవ పురస్కారం'ను ఇవ్వాలనుకుంటున్నాం."
రాము నిశ్శబ్దంగా నవ్వుతూ CEO చెప్పిన దానికి ఒప్పుకుంటాడు.
అతని మనసులో ఒక్కటే మాట:
"బాధతో భయపడితే జీవితం ఆగిపోతుంది. అదే బాధను మార్పుగా మార్చగలిగితే అదృష్టం నీ పక్కనే ఉంటుంది."
సారంశం: "జీవితం లో ఓటమి అనే మాట లేదు. ఆ మేఘాల వెనుక ఎప్పుడూ ఒక వెలుగు ఉంటుంది. నమ్మకం ఉంటే, దారి కనిపిస్తుంది."
"విషాదం జీవితానికి అంతం కాదు… అది ఓ కొత్త ప్రారంభానికి ఆహ్వానం."
Comments